అవును. మంత్రి మండలి ప్రాజెక్ట్ ప్రతిపాదనను మూల్యాంకనం చేసి ప్రాజెక్ట్ వ్యయాన్ని అంచనా వేసి 2015-16 వార్షిక బడ్జెట్ లో ప్రవేశపెట్టింది. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
APSSDC గుజరాత్లోని సీమెన్స్ కేంద్రాలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత నివేదికను సమర్పించింది. ఆ తర్వాత ప్రాజెక్ట్ ఖర్చులు మరియు క్లస్టర్ మోడల్ను వివరిస్తూ GO.MS.NO.4 30/06/2015 (స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ కింద https://goir.ap.gov.in/ https://goir.ap.gov.in/ వెబ్సైట్లో పబ్లిక్గా అందుబాటులో ఉంది) విడుదల చేయబడింది.
సంబంధిత పత్రాలు:
డాక్యుమెంట్ | వివరణ |
G.O.Ms.No. G.O.Ms.No. 4 - స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ & ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ - ప్రాజెక్ట్ క్లియరెన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SIEMENS సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (COEలు), టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్లు (TSDIలు) , స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను (SDCలు) ఏర్పాటు చేయడం – అవగాహన ఒప్పందానికి (MOU) ఆమోదం - ఉత్తర్వులు – జారీ చేయబడ్డాయి. | |
G.O.Ms.No.8 G.O.Ms.No.8 -స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్ మరియు ఇన్నోవేషన్ డిపార్ట్మెంట్ – ఫార్మేషన్ SIEMENS ప్రాజెక్ట్ ప్రోగ్రామ్ను పర్యవేక్షించడానికి కమిటీల - ఆర్డర్-జారీ చేయబడింది. | |
కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రిజల్యూషన్ నెం.33/2015 - ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సీమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ |
అవును, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ద్వారా వివరణాత్మక ఎవాల్యూయేషన్ జరిగింది, ఇది సిమెన్స్ మరియు డిజైన్టెక్ ప్రతిపాదించిన ప్రాజెక్ట్ వ్యయం సరైనదేనని నిర్ధారించింది. ప్రతి క్లస్టర్కు సిమెన్స్ నిర్దేశించిన రూ. 559.33 కోట్ల వ్యయం ఆమోదయోగ్యమైనదిగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ధృవీకరించింది.
- వివిధ సర్వీసులు కోసం ప్రతి క్లస్టర్కు సీమెన్స్ కేటాయించిన రూ. 13.31 కోట్ల అంచనా వ్యయం సరైనదని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఆమోదించింది.
- 476 డిజిటల్ కోర్సులను అందించడానికి ప్రతీ క్లస్టర్కు 249.75 కోట్లు అవుతుందన్న సీమెన్స్ అంచనా వ్యయం ఆమోదయోగ్యమైనదిగా ధృవీకరించబడింది.
- సాఫ్ట్వేర్ కోసం, ప్రతి క్లస్టర్కు 247.78 కోట్లు అంచనా వ్యయం అవుతుందన్న సీమెన్స్ ప్రతిపాదన అంగీకరించబడింది.
- హార్డ్వేర్ కోసం, ప్రతి క్లస్టర్కు మొత్తం 48.48 కోట్ల అంచనా వ్యయం అవుతుందన్న సిమెన్స్ ప్రతిపాదన ఆమోదయోగ్యమైనదని ధృవీకరించబడింది.
ఒక్కో క్లస్టర్ కి రూ. 559.33 కోట్ల ఖర్చు సహేతుకమైనదని CITD ధృవీకరించింది.
సంబంధిత పత్రాలు:
డాక్యుమెంట్ | వివరణ |
సిటీడ్ ఎవాల్యూయేషన్ | ప్రతిపాదనపై చేసిన వాల్యుయేషన్ వివరాలు |
APSSDC, Simens, DesignTech ప్రాజెక్ట్లో కీలకమైన వాటాదారులు.
క్రమ సంఖ్య | ఏజెన్సీ | రోల్ |
1 | APSSDC | COEలు మరియు T-SDIల గుర్తింపు - వాటి కమ్యూనికేషన్, ల్యాబ్ స్థలాల కేటాయింపు |
2 | Siemens | SISW అనేది DesignTechకి సాంకేతిక భాగస్వామి, ప్రోగ్రామ్ సలహాదారు. పరిశ్రమల ఇంటరాక్టివ్ సెషన్లను నిర్వహించడం, విద్యార్థుల పోటీలు, డిజైన్టెక్ ఫ్యాకల్టీకి శిక్షణ, సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం వంటి బాధ్యతలు ఉంటాయి. |
3 | DesignTech | ప్రాజెక్ట్ మొత్తాన్ని చూసుకొనే సిస్టమ్ ఇంటిగ్రేటర్, ఇంప్లిమెంటర్. సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇన్స్టాలేషన్, ల్యాబ్లను ఏర్పాటు చేయడం, విద్యార్థులను చేర్చుకోవడం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం. పరిశ్రమల ఇంటరాక్టివ్ సెషన్లు, విద్యార్థుల పోటీలు, సర్టిఫికేషన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తుంది |
4 | Institutes identified for skill development | ల్యాబ్ స్థలాల కేటాయింపు మరియు ప్రాజెక్టును కనీసం 10 సంవత్సరాల పాటు నిర్వహించడం |
అవును, గుజరాత్, తమిళనాడు మరియు జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే డిజైన్ టెక్ ప్రాజెక్ట్ని అమలు చేసే భాగస్వామి. భారతదేశంలో సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ చేసుకున్న అన్ని ఒప్పందాలలో డిజైన్ టెక్ సంస్థ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటర్, సిస్టమ్ ఇంటిగ్రేటర్గా పనిచేస్తుంది.
అవును, 31 మే 2018 నాటికి మొత్తం 40 కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. మార్చి 2020 నాటికి ఈ కేంద్రాలలో సుమారు 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందారు. 3 సంవత్సరాల ప్రాజెక్ట్ వ్యవధి పూర్తి అయిన తర్వాత ప్రాజెక్టు తాలూకు ఆస్తులు APPSDC మరియు హోస్టింగ్ ఇన్స్టిట్యూట్కి అందజేయబడతాయి.
లేదు. ప్రభుత్వ మరియు ప్రభుత్వ-సహాయక కళాశాలలలో కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.
- SIEMENS స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసిన ప్రతి 4 ఇన్స్టిట్యూట్లలో 1 గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్. మరికొన్ని ప్రభుత్వ సహాయం పొందిన సంస్థలు.
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా మొత్తం 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పొందారు. 70,000 మంది ఉపాధి పొందారు.
- సిమెన్స్ COE , t-SDI లు ఇంజనీరింగ్, డిప్లొమా విద్యార్థులు, ఫ్యాకల్టీకి వరల్డ్ క్లాస్ సీమెన్స్ ఎక్విప్మెంట్ & సాఫ్ట్వేర్పై శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. COE, T-SDI సిమెన్స్-సర్టిఫైడ్ భాగస్వాముల ద్వారా శిక్షణను అందిస్తాయి. పరిశ్రమ ఉపయోగించే అదే పరికరాలు/సాఫ్ట్వేర్తో శిక్షణ అందించి COE, T-SDI విద్యార్థి సమాజానికి నైపుణ్యాన్ని పెంపొందించి ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ శిక్షణలో చేరిన వారు పరిశ్రమలోని ఉత్తమ అభ్యాసాలను పొందుతారు. ప్రపంచవ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే సిమెన్స్ సర్టిఫికేషన్ వల్ల శిక్షణ పూర్తయిన తర్వాత ఉపాధి సులువుగా లభిస్తుంది.
- సీమెన్స్ ఆటోమోటివ్, ఇండస్ట్రియల్ మెషినరీ, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, షిప్ బిల్డింగ్ మొదలైన వివిధ పరిశ్రమల కోసం సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేస్తుంది.
- ఈ అన్ని రంగాలు, వారి సాఫ్ట్వేర్ను ఉపయోగించడానికి వారికి శిక్షణ పొందిన మానవ వనరులు అవసరం. అందుకే వారు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు మద్దతు ఇస్తూ అనేక మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి, తమ సాఫ్ట్ వేర్ ఉపయోగించే విధంగా ట్రైన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వారి సాఫ్ట్వేర్ను ఉచితంగా అందించడం ద్వారా ప్రజలు దానిపై శిక్షణ పొందగలరు. తద్వారా సీమెన్స్ సాఫ్ట్వేర్లో ఉద్యోగాలను చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు.
- సీమెన్స్ అలాగే దానిని అమలు చేస్తున్న రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.సీమెన్స్ తమకు అవసరమైన మానవ వనరుల్ని సమకూర్చుకోవడంతో పాటు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను కల్పిస్తుంది.
- ఇది ఒక గ్రాంట్స్ ప్రక్రియ. 90:10 ప్రైవేట్ పబ్లిక్ టెక్నాలజీ భాగస్వామ్యాలలో IT కంపెనీలు, ప్రభుత్వాలు ఇలాంటి పద్ధతులు అనుసరిస్తాయి. ఈ రకమైన ప్రాజెక్టులలో సాధారణంగా టెండర్లు ఉండవు. ఆ ప్రక్రియనే సీమెన్స్/డిజైన్టెక్ & గత AP ప్రభుత్వం అనుసరించింది.
- ప్రపంచవ్యాప్తంగా సిన్సినాటి, వాషింగ్టన్ వంటి అనేక విశ్వవిద్యాలయాలు ఇదే విధానాన్ని అమలు చేశాయి. భారతదేశంలో కూడా NIT వరంగల్, MIT (మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లతో పాటు గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలతో సీమెన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఆరోపణ 1: క్షేత్ర స్థాయిలో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.
నిజం:
- వాస్తవానికి, 34 TSDIలు (టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లు) మరియు 6 COEలు (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కేంద్రాలను క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేశారు. అవి సమర్ధవంతంగా చేస్తున్నాయి.
- ఇదే విషయాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వంలోని సీనియర్ అధికారి డాక్టర్ అర్జా శ్రీకాంత్ అధికారికంగా ధ్రువీకరించారు. APలో ప్రాజెక్ట్ను విజయవంతంగా అమలు చేసినందుకు డిజైన్ టెక్ (సీమెన్స్ భాగస్వామి)కి ప్రశంసా పత్రాన్ని కూడా అందించారు.
- ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లన్నింటినీ సీమెన్స్-డిజైన్ టెక్ నుంచి సంబంధిత కళాశాలలకు అప్పగించడం కూడా జగన్ రెడ్డి హయాంలో ఆగస్టు 2021 నుంచి జరిగింది.
- ఈ కేంద్రాలు అన్ని సంస్థలు, ఐఐఐటీ ఇడుపులపాయతో కలిపి లిఖితపూర్వకంగా లేఖలు రాశాయి. మొత్తం పరికరాలు మరియు సాఫ్ట్ వేర్ అందించబడ్డాయని, సరిగా పని చేస్తున్నాయని తెలిపాయి. కేంద్రాల్లో ఉన్న స్టాక్ రిజిస్టర్లపై కూడా సంతకం చేశాయి. ఈ విషయాన్ని ఈ కేంద్రాలు ఐఐఐటీ ఇడుపులపాయతో కలిపి లిఖితపూర్వకంగా లేఖలు ఇచ్చాయి. కేంద్రాల్లో ఉన్న స్టాక్ రిజిస్టర్లపై కూడా సంతకం చేశాయి.
- డిజైన్టెక్ వ్యవస్థాపకుడు వికాస్ ఖాన్వేల్కర్ మాట్లాడుతూ 'ఎంపిక చేసిన 40 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో 286 ల్యాబ్ లు ఏర్పాటు చేశాము. ఈ ల్యాబ్ లను 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పాము. ఈ ప్రాజెక్ట్ లో ఎంపిక చేసిన ప్రతీ సైట్ ను మేము స్వయంగా ఆమోదించాము. పూర్తి స్థాయిలో ల్యాబ్ లు ఏర్పాటైన తరువాత వారికి సంబంధిత పరికరాలు అందించాము. సుమారు 50 ట్రక్కులతో పరికరాలను అందించాము. ఇలా ప్రతీ డెలివరీని దగ్గరుండి పర్యవేక్షించి లొకేషన్లలో డెలివరీ చేశాము. వాటిని అన్ప్యాక్ చేసి అనంతరం వాటిని సరైన ప్రదేశాలలో ఇన్స్టాలేషన్ చేసాము. కావాలంటే వాటిని ప్రస్తుతం మీరు ఆ ల్యాబ్ లలో చూడొచ్చు. ’ అని అన్నారు.
ఆరోపణ 2: వివిధ షెల్ కంపెనీల ద్వారా నిధులు దారి మళ్లించి దోచుకున్నారు
నిజం:
- ఇది పూర్తిగా GST పన్ను ఎగవేతఇది పూర్తిగా పన్ను ఎగవేతకి సంబంధించినది. వివిధ కంపెనీలు నగదు బదిలీల బిల్లులతో GST పన్నుని తప్పించుకునేందుకు ఫేక్ ఇన్వాయిస్ లు సృష్టించి క్లెయిమ్ చేసుకొని నిధులు దారిమళ్లించారు.
- ఏదైనా కంపెనీ పన్ను చెల్లించకుంటే, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా భాద్యత వహిస్తుందిమా వైపు నుంచి, మేము అవసరమైన GST పన్ను భాగాన్ని కలుపుకుని మొత్తం రూ.371 కోట్లు విడుదల చేశాము. ఈ పన్ను ఎగవేతకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు.
- సీబీఎన్ రిమాండ్ రిపోర్టులోనూ చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులకు కానీ వారికి చెందిన కంపెనీలకు కానీ నిధులు దారి మళ్లించినట్లు ఎలాంటి సాక్ష్యాలను అందించలేదు.
- రిమాండ్ రిపోర్ట్లో 21వ పేజీ 10వ పేరాలో "వికాస్ ఖాన్విల్కర్ అనే వ్యక్తి నిధులు విత్డ్రా చేశారని.. ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉందని" రాశారు.
- ఈ ఆరోపణ ప్రకారం ఇప్పటి వరకు నిధులు ఎవరికి చేరాయనే అంశాన్ని నేటికి కూడా సీబీఐ స్పష్టం చేయలేదు. దీన్నిబట్టి అసలు ఈ కేసులో చంద్రబాబుకి ఎటువంటి ప్రమేయం లేదన్న విషయం తేటతెల్లమవుతోంది.
ఆరోపణ 3: టెండర్లను ఆహ్వానించకుండా సీమెన్స్తో ఒప్పందం.
నిజం:
- సీమెన్స్ నైపుణ్య అభివృద్ధి ప్రాజెక్ట్ 90% గ్రాంట్ ప్రతిపాదనతో ప్రభుత్వం వద్దకు వచ్చింది. ఏదైనా గ్రాంట్గా స్వీకరిస్తున్నప్పుడు టెండర్లను ఆహ్వానించాల్సిన అవసరం ఉండదు..
- సీమెన్స్ ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ పూర్తిగా పేటెంట్ పొందింది. మార్కెట్లోని మరే ఇతర కంపెనీకి ఇలాంటి సాఫ్ట్వేర్ లేదు. ఇది సీమెన్స్ సాఫ్ట్వేర్కి ఉన్న ప్రత్యేకత.ఇంత పారదర్శకత ఉన్నప్పుడు టెండర్లు ఆహ్వానించాలనే ప్రశ్న ఎలా ఉత్పన్నం అవుతుంది.?
- జగన్ రెడ్డి బైజూస్తో ఒప్పందం చేసుకున్నప్పుడు టెండర్లు పిలిచారా? ప్రభుత్వ బడుల కోసం బైజూస్ సంస్థ అధిపతి రవీంద్రన్ ముందుకొచ్చారని జగన్ రెడ్డి పొగడ్తాలతో ముంచెత్తారు. కానీ ఇప్పుడు బైజూస్ పూర్తిగా దివాళా తీసింది. ప్రస్తుతం ఈ సంస్థ తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది.
- ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారుల బృందం ఈ ఒప్పందాన్ని గుజరాత్లో ప్రాజెక్ట్ను పరిశీలించిన తర్వాతే సీమెన్స్తో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
- గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్ మొదలైన 9 రాష్ట్రాలు ఈ ప్రాజెక్టును అమలు చేశాయి. 9 రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ కోసం ఎటువంటి టెండర్లు వేయలేదు. నేరుగా ఒప్పందాలపై సంతకం చేశాయి..
- నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి టెండర్లు పిలవలేదు. సీమెన్స్తో ఒప్పందంపై ప్రధానిని ప్రశ్నించే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?
- వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, సిన్సినాటి స్టేట్ టెక్నికల్ అండ్ కమ్యూనిటీ కాలేజ్, సదరన్ వర్జీనియా హయ్యర్ ఎడ్యుకేషన్ సెంటర్ (SVHEC) వంటి అనేక అంతర్జాతీయ సంస్థలు సీమెన్స్ నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లు గ్రాంట్గా పొందాయి. ఆంధ్రప్రదేశ్ ఎందుకు ప్రయోజనం పొందకూడదు?
ఆరోపణ 4: ఈ ప్రాజెక్టు అమలులో హడావుడి ఎందుకు జరిగింది?
నిజం:
- ఈ ప్రాజెక్ట్ అమలు చేసేటప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి హడావుడి సృష్టించలేదు. ప్రాజెక్ట్లో ప్రతీ కీలక అంశానికి ముందు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
- 30-06-2015న G.O M.S 4 విడుదల చేయబడింది. మొదటి నిధుల కింద రూ.185 కోట్లు 5-12-2015న ప్రభుత్వం విడుదల చేసింది. G.O రిలీజ్ చేసిన 5 నెలల తర్వాత జరిగిన మొదటి చెల్లింపు ఇది.
- అలా చూస్తే ప్రాజెక్ట్లో ఎక్కడ హడావిడి జరిగింది? గుజరాత్లో అమలవుతున్న ప్రాజెక్టును అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం తరఫున బృందాలను పంపారు. CITD (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్) పరిశీలన కోసం కూడా సంప్రదించారు.ఈ మొత్తం ప్రాజెక్ట్ అమలు చేస్తున్నప్పుడు పారదర్శకత, నిర్ధారణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోబడ్డాయి.
ఆరోపణ 5: ఈ ప్రాజెక్టు లో రూ. 371 కోట్ల అవినీతి జరిగింది
నిజం:
The Forensic Auditor’s report did not have the details of how much money was exactly misappropriated. Different figures are circulating in the media as there is no clarity about the amount being cited. Forensic auditor’s conclusion of not engaging a professional evaluator to evaluate project cost is incorrect as a central government agency, the Central Institute of Tool Design was engaged for the same. Physical audit was eliminated from the scope of work of forensic auditor suspiciously in a pre-bid meeting though it was initially included. The investigation was based on inadequate information and faulty methodology to directly make any allegations of misappropriation.
- ప్రభుత్వం నియమించిన ఫోరెన్సిక్ ఆడిటర్, శరత్ అండ్ అసోసియేట్స్, జగన్ సొంత కంపెనీలైన ఐవీఎస్ అండ్ అసోసియేట్స్ ఆడిటర్ సర్వర్ ఒకే ఐపీ సర్వర్ అడ్రస్తో ఉన్నాయి. శరత్ అసోసియేట్స్ డొమైన్: sarathcas.in. IVS అండ్ అసోసియేట్స్ డొమైన్: ivsassociates.in
IP చిరునామా పోలిక:
115.124.126.242:80
115.124.126.216:80
ఈ రెండు ఏజెన్సీల వెబ్సైట్ల మధ్య సాన్నిహిత్యం ఫోరెన్సిక్ ఆడిటర్ మరియు ప్రభుత్వానికి మధ్య సంబంధాన్ని అనుమానించడానికి ఒక కారణం.